మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:22 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: తెలంగాణా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలనే డిమాండుతో, శుక్రవారం చలో అసెంబ్లీ, సేవ్ తెలంగాణ అని పిలుపునిచ్చారు.
దానిలో భాగంగా బెల్లంపల్లి మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరే ముందు, మండల నాయకులను అడ్డుకొని ముందస్తుగా అరెస్టు చేసిన తాళ్లగురజాల పోలీసులు. ఈ అక్రమ అరెస్టులను మండల అధ్యక్షుడు గజెల్లి రాజ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు పోలీసుల పాలన అని మండిపడ్డారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మండల ప్రధాన కార్యదర్శులు ముత్తే రామన్న, గాదర్ల నగేష్ కార్యదర్శి సాయి నాయకులు మహేష్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి….
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్











