గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,
తేదీ:22/08/2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి, గణేష్ మండపాల నిర్వహకులకు జిల్లా ఎస్పీ సూచన.
జిల్లాలో లక్కీ డ్రా, లాటరీలు వంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు, అవసరమైతే పీడి యాక్ట్ నమోదు చేస్తాం ~ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమురం భీమ్ ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో రాబోయే గణేష్ నవరాత్రి వేడుకలు, దసరా వంటి పండుగలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు.
జిల్లాలో లక్కీ డ్రాలు, లాటరీలు, బహుమతి పథకాలు వంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఆదేశించారు.
ఎస్పీ మాట్లాడుతూ…, లాటరీ విధానం, లక్కీ డ్రా వంటి కార్యకలాపాలు పూర్తిగా చట్ట విరుద్ధమని, వీటి ద్వారా అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అక్రమ లాటరీలు లేదా లక్కీ డ్రాలను నిర్వహించే నిర్వాహకులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రంలో లాటరీలు, లక్కీ డ్రా విధానంపై నిషేధం ఉందని, నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే పీడి యాక్ట్ (PD Act) నమోదు చేయబడుతుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “జిల్లాలో ఎక్కడైనా లాటరీలు లేదా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712670551 కు తెలియజేయాలని అన్నారు.
జిల్లా ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు విభాగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజలు కూడా విధిగా పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
