భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
మణుగూరు
✍️దుర్గా ప్రసాద్
పీకే ఓ సి ఔట్ సోర్సింగ్ పనులలో ఏర్పడిన ఖాళీలలో కేవలం భూ నిర్వాసితులను మాత్రమే పెట్టుకోవాలని ఎండి ఎన్.బలరాం ఆదేశాల అమలు చేయాలి
పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
మణుగూరు ఏరియా పీకే ఓ సి ఔట్ సోర్సింగ్ టెండర్ పనులలో ఏర్పడిన ఖాళీలలో కొత్త టెండర్లలో భూ నిర్వాసితులను మాత్రమే పెట్టుకోవాలని ఎండి ఎన్. బలరాం ఆదేశాల అమలు చేయాలని కోరుతూ శనివారం నాడు పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పనులలో అనగా సివిల్ , పర్చేజ్ , సెక్యూరిటీ మరియు ఓబి కాంటాక్ట్ పనులలో ఏర్పడే ఖాళీలలో, నూతన టెండర్లలో కేవలం సింగరేణి భూ నిర్వాసితులను మాత్రమే అవకాశం కల్పించాలని గౌరవ సింగరేణి సిఎండి ఎన్. బలరాం (ఐఆర్ఎస్) ఆదేశాలు టెండర్ షరతులలో కూడా ఈ అంశాన్ని నూతనంగా చేర్చారు.
అయితే పీకే ఓసి లో కొంతమంది కాంట్రాక్టర్లు యాజమాన్యానికి సమాచారం లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా నిర్వాసితులేతరులను మెడికల్ విటిసి చేపిస్తూ గతంలో పని చేశారని మరొకటిని బ్యాక్ డోర్ లో పనిలోకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారనీ ఇప్పటికే కొంతమందిని పనుల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. పర్చేజ్ టెండర్ల లోని ఆయిల్ బ్యారెల్స్ లిఫ్టింగ్, వాషింగ్ ప్లాంట్, మక్ రిమూవల్ , సివిక్, పారిశుద్ధ్యం పనులలో కొత్తవారిని పెట్టారనీ విశ్వసనీయంగా తెలిసిందన్నారు దీనికి సంబంధించి ఏరియా రిప్రజెంటేటివ్ యూనియన్ ఐ ఎన్ టి యు సి నాయకులు కూడా పైసలు పెట్టు పని కొట్టు అని ఆరోపిస్తూ పత్రికలకు ప్రకటనలు కూడా చేశారని దయచేసి ఈ విషయంపై మల్లేపల్లి ఓసీలో భూములు కోల్పోబోతున్న నిర్వాసితులకు, కోల్పోయిన వారికి ప్రభావిత గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
















