ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.