మంచిర్యాల జిల్లా,
తాండూరు,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
తాండూరు: తెలంగాణా రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను వరద పోటెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సాపూర్ గ్రామంలో వాగు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ క్రమంలో ఓ గర్భిణికి అత్యవసర వైద్య చికిత్స కోసం గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
అయితే వాగు ఉధృతి కారణంగా కుటుంబ సభ్యులు స్వయంగా ఆమెను దాటించే ప్రయత్నము చేసి విఫలమయ్యారు. విషయం తెలిసిన వెంటనే తాండూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, వరద ఉధృతిని లెక్క చేయకుండా తాడు సాయంతో బాధితులను వాగు దాటించి అవతలి వైపుకు చేర్చారు.. గర్భిణిని భుజాన మోసుకుంటూ సురక్షితంగా వాగు దాటించారు.
అనంతరం ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. తమ ప్రాణాలకు తెగించి అత్యవసర సమయంలో సహాయం చేసిన పోలీసులకు గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు చేసిన ఈ రక్షణ చర్యను శబాష్ పోలీస్ అని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






