భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పినపాక ఏజెన్సీ
✍️దుర్గా ప్రసాద్
పినపాక ఏజెన్సీ ఏరియాలోని అనుమతులు లేనీ టైలరింగ్, మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తూన్న అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి అని ఐటీడీఏ పీవో బి. రాహుల్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ఏరియాలోని అనుమతులు లేనీ టైలరింగ్, మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తూన్న అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలనీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ… సోమవారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారు లో పీవో బి. రాహుల్ కి వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ఏరియాలో అనుమతులు లేనటువంటి టైలరింగ్ ,మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయనీ వీటిని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో యజమానులు ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తూ ఒక పద్ధతి లేకుండా ఏ షాపు వారు ఆ షాపు అధిక ధరలు పెంచుకుంటూ సామాన్యుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు.
సామాన్య, మధ్యతరగతి ప్రజలు వస్త్రాలు కుట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీనిపై ఆధారపడి జీవిస్తున్న టైలర్లు కూడా వీటి ధాటికి ఉపాధి కోల్పోయారన్నారు. ఏజెన్సీ ప్రాంతం కనుక గిరిజన చట్టాల నేపథ్యంలో అనుమతులు లేనటువంటి టైలరింగ్ మగ్గం వర్క్ షాపులపై తగు చర్యలు తీసుకోగలరని బి. రాహుల్ కోరినట్లు బాబు తెలిపారు.
భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో పిఓ ప్రత్యేక కృషితో గిరిజన సాంప్రదాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక మొక్కను బహుకరించారు.
ఇవి కూడా చదవండి …
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు  పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
















