మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:22 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: తెలంగాణా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలనే డిమాండుతో, శుక్రవారం చలో అసెంబ్లీ, సేవ్ తెలంగాణ అని పిలుపునిచ్చారు.
దానిలో భాగంగా బెల్లంపల్లి మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరే ముందు, మండల నాయకులను అడ్డుకొని ముందస్తుగా అరెస్టు చేసిన తాళ్లగురజాల పోలీసులు. ఈ అక్రమ అరెస్టులను మండల అధ్యక్షుడు గజెల్లి రాజ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు పోలీసుల పాలన అని మండిపడ్డారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మండల ప్రధాన కార్యదర్శులు ముత్తే రామన్న, గాదర్ల నగేష్ కార్యదర్శి సాయి నాయకులు మహేష్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి….
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
