మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:14 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
కాంట్రాక్టర్ బస్తీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్….
బెల్లంపల్లి: పట్టణంలోని 18 వ వార్డు కాంట్రాక్టర్ బస్తీలో గురువారం మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ సందర్శించారు.
బస్తీ ప్రజలు దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న పారిశ్యుద్ధత, డ్రైనేజీ, మురికి కాలువల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వార్డ్ సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా నిధులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సైన్యం జాతీయ ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు.
బస్తీ ప్రజల సమస్యలను కళ్ళారా వీక్షించిన కమిషనర్ సానుకూలంగా స్పందించినట్టు కలిపాక శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుంకే తిరుపతి, మచ్చ చిరంజీవి, ఆడెపు రవి కుమార్, వోడ్నాలా మనోహర్, సామల రాజేశ్వరి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
