మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ…
బెల్లంపల్లి: రాబోయే వినాయక చవితి సందర్భంగా మంగళవారం స్థానిక కాంటా చౌరస్తాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు అందజేసారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ…
పర్యావరణానికి ముప్పు కలిగించకుండా ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన గణపతులను ప్రతిష్టించాలని కోరారు. ప్రకృతికి హాని తలపెట్టే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయబడిన వినాయకులను ప్రతిష్టించడం వలన పర్యావరణానికి హాని తలపెట్టినవారమవుతామని అన్నారు. ప్రజలందరూ కలిసి మెలసి భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ బాపురెడ్డి,దేవాలయ అర్చకులు సతీష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
