మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:27 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద బుధవారం వినాయకచవితి వేడుకలు వైభవంగా జరిగాయి.
ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్-రాజేశ్వరిల ఆధ్వర్యంలో విగ్రహ దాతలు ముత్యాల సంగీత, నాగరాజు, మోక్షిత్, రుద్రాన్ష్ కుటుంబీకులు మరియు దాతలు భక్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.
పూజారి అర్చకులు దుద్దిల్ల మాధవ కృష్ణ శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు.
ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ మాట్లాడుతూ…, తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు విగ్రహ దాతలు, భక్తులు దాతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
