మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:30 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో ఎస్.బీ.హెచ్ బ్యాంకు కు అనుకుని ఉన్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్ స్థానిక మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఆంధ్రా బ్యాంకు నుండి ఎస్.బీ.హెచ్ బ్యాంకు వరకు అప్పటి మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలు పెట్టి ఆంధ్రా బ్యాంకు నుండి ఎస్.బీ.హెచ్ వరకు రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిస్తే, కొందరి సొంత ప్రయోజనాల కోసం పైరవీకారులు పనులను ఆపించారని తెలిపారు.

కాల క్రమేనా కొందరు మురికి కాలువలను సైతం వదల కుండా కబ్జాలు చేస్తున్నారని, అలాంటి నిర్మాణాలను హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఠాకూర్ సత్యనారాయణ సింగ్, వోడ్డపల్లి గోపి, సుంకే తిరుపతి, మురుకూరి బాలకృష్ణ,కొత్తపల్లి రవీందర్,కిరణ్ కొలిపాకలు పాల్గొన్నారు.