భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల 10 వ తేదిన కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి పాల్వంచ పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ సమావేశం రేపు ఆదివారం 31వ తేదిన మధ్యాహ్నం 3 గంటలకు పాల్వంచ భద్రాచలం రోడ్డులోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమైనది.

ఈ సందర్భంగా ఈరోజు పాల్వంచలోని కొత్తగూడెం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ బాధ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి నివాసంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులు మాజీ పాల్వంచ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూసల విశ్వనాథం, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ లు మాట్లాడుతూ… కేటీఆర్ గారి కొత్తగూడెం నియోజకవర్గ పర్యటన వచ్చేనెల 10 వ తేదీన ఉంటుందని ఈ పర్యటనలో భాగంగా కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ నాయకులతో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ భాధ్యులు వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన రేపు పాల్వంచ పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొంటారని రేపు జరగబోయే ఈ సమావేశానికి పాల్వంచ పట్టణ, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా అన్నాఈ సమావేశంలో కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, పూసల విశ్వనాథం, కాంపెల్లి కనకేష్ పటేల్, ఎచ్చర్ల రమణమూర్తి నాయుడు, కనకాల బాలకృష్ణ, దాసరి నాగేశ్వరరావు, మడి సరస్వతి, ముగితే గురవయ్య, బట్టు మంజుల, దొడ్డి సురేష్, శీలం సమ్మయ్య గౌడ్, భూక్య చందు నాయక్, కాలేరు సింధు తపస్వి, గుండాల వెంకటనారాయణ, మడి ఈశ్వర్, యన్. వీరభద్రం, ఆర్ వి రమణ, కాలేరు అఖిల్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.