మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
ఈరోజు బెల్లంపల్లి ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ…, ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి,నినాదాలు చేస్తూ ఘనమైన నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ… కమ్యూనిస్టు ఉద్యమాలలో తనదైన పోరాటపటిమ చూపిన సుధాకర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారని తెలిపారు.
తెలంగాణ పోరు 2009 లో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయన మద్దతు పలకడమే కాక పార్టీని సైతం ఒప్పించారని, పార్టీ శ్రేణులు ఉద్యమంలో మమేకమయ్యేలా ప్రోత్సహించారని, ఎస్సీ వర్గీకరణపై పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించి చట్ట సవరణకు డిమాండ్ చేశారని, పలు ఇతర సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచారని, ఆయన మరణం యావత్తు భారతదేశ ప్రజలకు, కమ్యూనిస్టు పార్టీలకు తీరనిలోటని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజశేఖర్, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
