ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.

సహస్ర ఘటాభిషేకం పూజలో AP మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొనగా, ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, చేసి సహస్ర ఘటాభిషేకం తర్వాత మహానివేదన, నీరాజన, మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అన్ని అర్జిత సేవలు నిలిపి, దర్శనాలు కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. రేపు వేకువజామున మంగళ వాయిద్యాలకు ముందుగా గర్భాలయంలోని జలాన్ని తొలగించి యథావిధిగా ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.