సంఘటనలు

618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్ వంశం చైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి ఛక్రవర్తి.

1265: వెనిస్ రాయబారులకూ మైఖేల్ VIII పాలియోలోగోస్ చక్రవర్తికీ మధ్య బైజాంటైన్-వెనీషియన్ ఒప్పందం కుదిరింది. కానీ డోగే రెనిరో జెనో దీన్ని ఆమోదించలేదు.

1815: వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టె బెల్జియం లోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధంగా పిలుస్తారు).

1858: ఛార్లెస్ డార్విన్ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి అందుకున్నాడు.

1953: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.

1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ని స్థాపించారు.

1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న ‘చెకర్ మోటార్స్ కార్పొరేషన్’ తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారిగా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు.

1940: రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.

1972: బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో ఇది ఒకటి.

1977: ఎస్.ఎల్. షక్‌దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారిగా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు)

1981: ఎయిడ్స్ రోగాన్ని కాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు.

1982: ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు)

1983: ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్‌లో భారత్ తరపున తొలి శతకాన్ని నమోదుచేశాడు.

1983: మొదటి అమెరికా రోదసీ యాత్రికురాలు సాల్లీ రైడ్ (ఎస్.టి.ఎస్-7)

2001: భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్లో ఆందోళనలు జరిగాయి.

2006: మొదటి కజక్ దేశపు ఉపగ్రహం ‘కజ్ శాట్’ ప్రయోగించారు.

జననాలు

1942: రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు.

1953: జి. రాజ్ కుమార్, రాజకీయ నాయకుడు, జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ (మ. 2021)
1955: శాండీ అల్లెన్ Archived 2011-08-10 at the Wayback Machine, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7’7 1/4″ (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)

1921: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)

1970: అరవింద్ స్వామి , దక్షిణ భారత చలన చిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త , టీ.వి.వ్యాఖ్యాత.

1974: ప్రియా రామన్, దక్షిణ భారత చలన చిత్ర నటి, టెలివిజన్ నటి, నిర్మాత.

మరణాలు

1929: వేదము వేంకటరాయ శాస్త్రి, పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త (జ.1853).

1936: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత (జ.1868).

1948: హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు (జ.1888).

1953: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది (జ.1902).

1986: ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకుడు (జ.1908).

2017: గండవరం సుబ్బరామిరెడ్డి, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్వహకుడు, విమర్శకుడు (జ. 1937).

పండుగలు , జాతీయ దినాలు

ఆటిస్టిక్ ప్రైడ్ డే

హిందూమహాసముద్రం లోని సీ ఛెల్లెస్ దేశపు (ద్వీప సముదాయం) జాతీయ దినం.

గోవా స్వాతంత్ర్య దినోత్సవం.

అంతర్జాతీయ విహార దినోత్సవం.

అంతర్జాతీయ పితృ దినోత్సవం (మూడవ ఆదివారం)