సంఘటనలు

1914: ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు.

జననాలు

1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.

1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. (మ.2004)

1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (మ.2011)

1935: ఆచంట వెంకటరత్నం నాయుడు, నాటక రచయిత (మ.2015)

1968: తులసి , తెలుగు చలనచిత్ర నటి.

1976: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (మ.2018)

మరణాలు

1836: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1751).

1909: దంపూరు వెంకట నరసయ్య – నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు. (జ.1849)

1983: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (జ.1901)

1964: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (జ.1899)

2019: అబ్బూరి ఛాయాదేవి తెలుగు కథా రచయిత్రి (జ.1933)

2022: పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1929)

పండుగలు, జాతీయ దినాలు

పేదల దినోత్సవం.

నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే.