ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదికగా నిలవనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 10న భువనేశ్వర్ లో ఈ పోటీలు ఆరంభమవుతాయి.

“సెప్టెంబర్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ కు ముందు భారత క్రీడకారులు స్వదేశంలో సత్తా చాటేందుకు కాంటినెంటల్ ఈవెంట్ ఉపయోగపడుతుంది. ఈ ఈవెంట్ నిర్వహణ దక్కడం ఎంతో సంతోషంగా ఉంది” అని అఖిల భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు అడ్లీ సుమరివాలా తెలిపాడు.