ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ LICలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో 2-3 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది.

2027 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 10 శాతానికి చేర్చాలనే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.