చరిత్రలో ఈ రోజు…
మే 01…

సంఘటనలు

1006: లూపస్ అనే రాశి లో, చైనీయులు, ఈజిప్షియనులు, సూపర్ నోవా (పేలిపోతున్న నక్షత్రం) ను గమనించారు.

1544: హంగరీని టర్కీ దేశ సైన్యం ఆక్రమించింది.

1682: పారిస్ వేధశాల (నక్షత్రాలను, గ్రహాలను గమనించే ప్రయోగశాల – అబ్జర్వేటరీ) ను, లూయి 15 అతని సభలోని సభ్యులు ప్రారంభించారు.

1704: మొట్టమొదటి ‘వ్యాపార ప్రకటన’ బోస్టన్ న్యూస్ లెటర్ లో ప్రచురితమైంది.

1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి ‘యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ గా ఏర్పడింది.

1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది.

1898: డేవీ డే (మనీలా బే యుద్ధం) (అమెరికాలో)

1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు).

1925: సైప్రస్ దీవి బ్రిటిష్ వలసగా మారిన రోజు.
1931: న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు.

1954: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.

1960: గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూఢాచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది.

1960: డెన్మార్క్ లో, లీగో లేండ్ ప్రారంభమయింది.
1960: గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.

1963: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్)

1967: ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.

1988: జనరల్ వి.ఎస్. శర్మ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

జననాలు

1769: డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ

1867: కాశీనాథుని నాగేశ్వరరావు, పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1938)

1901: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (మ.1979)

1913: పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.

1916: గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు.

1919: మన్నా డే, నేపథ్య గాయకుడు.

1924: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు.

1925: నార్ల చిరంజీవి, కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు, సినీ గీత రచయిత.(మ .1971)

1926: ఇక్బాల్ సింగ్, సిక్కు సమాజానికి చెందిన భారతీయ సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2022)

1927: ఇస్రార్ అలీ, పాకిస్థాని మాజీ క్రికెటర్. (మ.2016)

1943: కొలకలూరి స్వరూపరాణి, తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.

1943: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.

1944: సురేష్ కల్మాడీ, భారత రాజకీయవేత్త.

1944: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.2002)

1946: కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (మ.2017)

1949: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది.

1950: రాజాచంద్ర, తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1987).

1952: టి.జీవన్ రెడ్డి, 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి.

1955: రాధేయ, తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత.

1958: సోమేపల్లి వెంకట సుబ్బయ్య, రచయిత.

1965: దొడ్ల నారపరెడ్డి, ఆయుర్వేద వైద్యులు, రచయిత.

1971: అజిత్ కుమార్, భారత దేశ సినీ నటుడు.

1974: కస్తూరి , దక్షిణాభారత సినీనటి , మోడల్, టీ వీ వ్యాఖ్యాత.

1981: సుమన్ శెట్టి, తెలుగు హాస్య నటుడు.

1988: అనుష్కశర్మ , భారతీయ సినీ నటి

మరణాలు

2024: ఉమా రామనన్, తమిళ చలనచిత్ర నేపథ్యగాయని. (జ.1954/55)

పండుగలు , జాతీయ దినాలు

మే దినోత్సవం – లేబర్ డేగా 66 దేశాలలో జరుపుకుంటారు.

వప్పు డే (ఫిన్లాండ్)
లీ డే (హవాయి లో)
పిల్లల ఆరోగ్య దినం (అమెరికాలో)

యూనస్ ఎమ్రే స్మృతి దినం (టర్కీలో)

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం.