పహల్గామ్ దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని కోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది.

ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలని సూచించింది. ఇతర రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు తెలిపిన పిటిషనర్ దానిని ఉపసంహరించకున్నారు.