సంఘటనలు

1494: క్రిస్టఫర్ కొలంబస్ జమైకాను కనుగొన్నాడు. దానికి ‘ఇయాగొ’ అని పేరు పెట్టాడు.

1791: ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ మే 3 (ఐరోపాలో మొట్టమొదటి ఆధునిక రాజ్యాంగం) –పోలిష్-లిథూనియన్ కామన్‌వెల్త్ ‘సెజ్మ్’ ప్రకటించింది. (20వ శతాబ్దానికి ముందు పోలిష్ పార్లమెంట్ లోని దిగువ సభ (మన లోక సభ వంటిది), ఎగువ సభ (మన రాజ్య సభ వంటిది), వారి రాజు, ఈ మూడింటిని కలిపి ‘సెజ్మ్” అనేవారు).

1802: వాషింగ్టన్ డి.సి. ని, ఒక నగరంగా గుర్తించారు.

1830: ప్రతీరోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు, మొదటిసారిగా మొదలయ్యాయి.

1837: యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ స్థాపించారు.

1841: న్యూజిలాండ్దేశం బ్రిటిష్ కోలనీగా మారింది.

1855: ఏంట్‌వెర్ప్ – రోటర్‌డాం రైలు మార్గం మొదలయింది.

1906: సినాయ్ ద్వీపకల్పం బ్రిటిష్ ఆధీనంలో ఉన్న ఈజిప్ట్ సరిహద్దుగా ఏర్పడింది. సినాయ్ని టర్కీ నుంచి ఈజిప్ట్ తీసుకుంది.

1913: భారతదేశ సినీ చరిత్రలో మొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల.

1939: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.

1968: యునైటెడ్ కింగడమ్ దేశంలోని లండన్లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స.

1969: భారత రాష్ట్రపతిగా వి.వి.గిరి పదవిని చేపట్టాడు.

1973: చికాగో లోని ‘సియర్స్ టవర్’ ప్రపంచంలోని ఎత్తైన భవంతిగా గుర్తింపు పొందింది.

1978: ‘సూర్య దినం’ – ‘సౌర శక్తి’ కి సంబంధించిన విశేషాలు అమెరికాలో తిలియ చేసారు.

1986: ‍శ్రీలంకలో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.

2002: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు.

2005: ఇరాక్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది.

జననాలు

612: కాన్‌స్టేన్‌టైన్-III, బైజాన్‌టైన్ చక్రవర్తి (మ. 641)

1892: జార్జ్ పేజెట్ థామ్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ. 1975). భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతల పట్టిక.

1932: బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త. (మ.2006)

1950: మణివణ్ణణ్, భారత సినిమా నటుడు.

1959: ఉమా భారతి, కాషాయధారిణి, భారతదేశపు రాజకీయవేత్త.

1970: పద్మావతి. ఎల్, వీరికి రంగస్థలనటిగా 16 సంవత్పరాల అనుభవం ఉంది. చాలా సాంఘిక నాటిక/నాటకల్లో ప్రధాన స్త్రీ పాత్రలను పొషించారు.

1990: మేఘన రాజ్, దక్షిణ భారత చలన చిత్ర నటి.

మరణాలు

1616: షేక్స్పియర్, ఆంగ్ల నాటక కర్త, నటుడు (జ.1564). (జూలియన్ కేలండర్ ప్రకారం, ఇతడి మరణం, 23 ఏప్రిల్ గా, జనామోదం పొందింది)

1969: జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (జ.1897)

1981: నర్గీస్ భారత సినిమా నటి (జ. 1929)

1998: వెంకటేష్ కులకర్ణి, భారతీయ-అమెరికన్ నవలా రచయిత, విద్యావేత్త. (జ. 1945)

1999: అప్పలాచార్య, సినిమారచయత.

2006: ప్రమోద్ మహాజన్, భారత రాజకీయవేత్త. (జ. 1949)

2023: మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (జ. 1953)

పండుగలు, జాతీయ దినాలు

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.

ప్రపంచ ఆస్తమా దినోత్సవం.