సంఘటనలు

1956: తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు.

1969: భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి.

1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి.

2000: ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.

జననాలు

1827: మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (మ.1857)

1902: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా పేరొందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1968)

1924: కె.సి.శివశంకరన్, “శంకర్” గా సుపరిచితుడైన చిత్రకారుడు. (మ.2020)

1954: దామెర రాములు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి.

1955: రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1956: రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నటుడు.

1979: మాళవిక, భారతీయ సినీనటి…తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు.

1983: సింధు తులాని, భారతీయ సినీనటి…తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు.

మరణాలు

1972: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901)

1991: చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (జ.1912)

2024: అడిగోపుల వెంకటరత్నం, కవి, రచయిత.