గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు.
రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, AP మంత్రులు నారా లోకేశ్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ పాటు పలువురు TDP ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
