తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

నిన్న(మంగళవారం) శ్రీవారిని 75,183 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,906 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.