శ్రీవాణి టికెట్ల కోటాను TTD భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది.
1500 టికెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా క్రింద తిరుమలలో 2 వేల టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టికెట్లు జారీ చేయాలని TTD నిర్ణయం తీసుకుంది.
