మెదక్ జిల్లా
✍️శివ కుమార్ గౌడ్

కాళ్లకల్ గ్రామానికి చెందిన పటేల్ నిర్మల అనే మహిళ కిడ్నీ సంబంధిత సమస్య తో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా బాధితుల అభ్యర్తన మేరకు మెదక్ ఎంపీ రఘునానందన్ రావు చొరవతో మంజూరు అయిన 21 వేల సిఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం నత్తి మల్లేష్ బాధితులకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నత్తి లావణ్య, మాజీ మండల అధ్యక్షుడు నరేందర్ చారి, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.