< 1 Min

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాత పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలనీ, అందరికీ శుభం జరగాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

పాత పాల్వంచ గడియకట్టలోని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల పనులు ప్రారంభం సందర్భంగా ఆదివారం కర్రపూజ జరిపారు.

ఈ కార్యక్రమంలో కొత్వాల అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఏ పనైనా ప్రారంభానికి ముందు గణేష్ పూజ చేస్తే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మంచి జరుగుతుందన్నారు. నిర్వాహకులు గణపతి ఉత్సవాలను నియమనిష్టలతో జరిపి దైవ కృపకు పాత్రులు కావాలని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమంలో గడియకట్ట పెద్దలు B శేషగిరిరావు, B పాపారావు, A భాస్కర్, V రమేష్, M శరత్, R మల్లేష్, A వెంకట్రావు, వినయ్, K బాబురావు, P నాసరయ్య, తోపాటు ఉత్సవ కమిటీ సభ్యులు G వెంకటేశ్వర్లు, B అన్వేష్, G ప్రవీణ్, B సాగర్, K నాగరాజు, B ప్రశాంత్, P బాలాజీ, K రఘు, B జగన్, B బాలా, R శంకర్ రెడ్డి, M రమేష్, మరియు కాలనీ మహిళలు, భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.