మంచిర్యాల జిల్లా,
దండేపల్లి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
దండేపల్లి: గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గిరిజనుల సమస్యలపై జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, డి.సి.పి. ఎ.భాస్కర్, దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుండి పోడు భూములు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించి జీవనాధారం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
కొంతమంది గిరిజనులు ప్రస్తుత కాలంలో అటవీ భూమిని ఆక్రమించి పోడు వ్యవసాయ సాగు చేస్తూ పట్టాలు అడగడం జరుగుతుందని, షెడ్యూల్డ్ తెగలకు కల్పించిన హక్కుల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుందని, చేపట్టవలసిన చర్యలపై అటవీశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తుందని తెలిపారు. అర్హులైన గిరిజనులకు అటవీ భూములలో వెదురు సాగు చేసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని, సాగుకు అవసరమైన మొక్కలు, కూలీల ఖర్చులు ప్రభుత్వం అందించి పంటను విక్రయించుకునేందుకు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేయించి గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.
పండ్ల మొక్కల పెంపకంపై రైతులకు మెలకువలు అందించి, కూలీల ఖర్చులు, మొక్కలు, సాగునీటిని అందించి పంట దిగుబడిని విక్రయించుకునేలా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 5 శాతం ఉద్యానవన పంటల సాగు జరుగుతుందని, జిల్లాలోని దేవునిపల్లి గ్రామంలో 150 హెక్టార్ల విస్తీర్ణంలో గిరిజనులతో మల్బరీ సాగు చేయించడం జరుగుతుందని తెలిపారు.
మల్బరీ సాగు సంవత్సరం నుండి సంవత్సరన్నర కాలంలో దిగుబడి వస్తుందని, గిరిజనులు సమన్వయంతో ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పంట సాగులో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపామని అన్నారు. పంట ఉత్పత్తి విక్రయించుకునేందుకు గిరిజన కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధర నిర్ణయించడం జరుగుతుందని, గిరిజనుల కోసం గోదాం, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కోటపల్లి, వేమనపల్లిలలో మల్బరీ సాగులో ఉత్పత్తి తో పాటు దారం తయారు చేసేందుకు గిరిజన రైతులకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
