భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
అశ్వాపురం
✍️దుర్గా ప్రసాద్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన భూభారతి రెవిన్యూ సదస్సులలో అశ్వాపురం మండలం నుండి తొలి అప్లికేషన్ సక్సెస్ ఫుల్ గా రిసిస్ట్రేషన్ చేసారు.

ఈ సందర్బంగా తహసీల్దార్ మణిదర్ మీడియా తో మాట్లాడుతూ అశ్వాపురం రెవిన్యూ పరిధిలో జగ్గారం గ్రామ నివాసితుడు ఎల్లావుల శ్రీనివాస రావు గత పిబ్రవరి నెల లో మరణించగా.. ఇటీవల వారు రెవిన్యూ సదస్సు లో దరఖాస్తూ చేసుకొన్నారు..

తహసీల్దార్ ఆ భూమి కి సంబందించిన కుటుంబ సభ్యులందరికి నోటిస్ లు జారీ చేసిన 10 రోజుల తర్వాత ఎటువంటి అభ్యంతరాలు నమోదు కానందున బుధవారం రోజు శ్రీనివాస్ భార్య అయిన ఎల్లావుల ధనమ్మ కి సక్సెషన్ రిసిస్టేషన్ చేసారు..రైతు కుటుంబం అంత హర్షం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమం లో ఆపరేటర్ అనుదీప్, రేణుక, సాగర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

error: -