మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:14 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: వాతావరణ శాఖ ద్వారా రాబోయే 24 గంటలలో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ వారు పలు సూచనలు చేశారు.
వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్ల వద్దని, వాగులు, నాలాలు దాటుతున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అలాగే శిథిలావస్థలో ఉన్న భావనల కింద ఉండరాదని, రోడ్డు ప్రక్కన తడిచి ఉన్న విద్యుత్తు స్తంభాలను ముట్టరాదని, వర్షం కారణంగా బురదమయమైన రోడ్లపై ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వాహనాలు నెమ్మదిగా నడపాలని తెలిపారు. వార్డ్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు,ప్రజలను అప్రమత్తం చెయ్యాలని కోరారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
