రామగుండం కమిషనరేట్,
మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన మామిడి రాజన్న స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ పౌర సేవలో ఉత్తమ విధులు నిర్వహించినందుకు గాను రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ఉత్తమ పోలీసు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఆయనను అభినందించారు. రాజన్న మాట్లాడుతూ… ప్రశంసా పత్రము చాలా గర్వంగా ఉందని, దీనితో తమపై మరింత బాధ్యతలు పెరిగాయని అన్నారు. విది నిర్వహణలో అతన్ని ప్రోత్సహించిన పోలీసు అధికారులకు,కమీషనర్ కు ధన్యవాదాలు తెలిపారు.

error: -