మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: పట్టణంలోని అంబేద్కర్ నగర్ వార్డు 3,17 లో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. ప్రభుత్వాలు మారినా మా దుర్భరమైన పరిస్థితి మారలేదని వాపోతున్న ప్రజలు.

ఎవరైనా మా బస్తీలోకి రావాలంటేనే ఎక్కడ గుంత ఉంటుందో అర్థం కాక భయపడుతున్నారని, గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద పెద్ద గుంతలు పడి అధ్వానంగా మారిన రోడ్డు పరిస్థితిని అధికారులు పరిశీలించాలని బస్తీ ప్రజలు కోరారు.

ఇకనైనా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు బెల్లంపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి బస్తీలోని బురద నుండి మాకు విముక్తి కల్పించండని ప్రజలు వారి బాధను వ్యక్తం చేశారు.

error: -