భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్పీ కార్యాలయం
20.08.2025
✍️దుర్గా ప్రసాద్
అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలందరూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ జిల్లా పోలీస్ శాఖ లోతట్టు ప్రాంత ప్రజలకు అండగా ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గార్లు మాట్లాడుతూ…
దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పాయింట్ ను తనిఖీ చేసి, ఒకవేళ గోదావరి ఉధృతి మరింతగా పెరిగినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం భద్రాచలం వద్ద కరకట్టపై నుండి గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించారు. భద్రాచలం పట్టణవాసులతో పాటు పరిసర లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. అక్కడ విధులలో ఉన్న NDRF మరియు DDRF బృందాల అధికారులకు కూడా పలు సూచనలను చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
