మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:22 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమైనది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, తెలంగాణ రాష్ట్రంలో జానపద కళాకారులకు కొదవలేదని రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున పేద కళాకారులకు వారి పొట్ట నిండే విధంగా జీవనోపాధిని సంఘం కల్పిస్తుందని తెలిపారు.
బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు జంజర్ల దినేష్ కుమార్ మాట్లాడుతూ … మరుగున పడుతున్నటువంటి జానపద కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని, అలాగే కళాకారులకు జీవనోపాధిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ సీనియర్ కళాకారులు బొంకురి రామచందర్, తోటపల్లి రాజేష్, మిట్టపల్లి మల్లేష్, శనిగరపు రాజేందర్, ఇనుముల రాయమల్లు, పోతర్ల లింగయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
