భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప….

అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాల్వంచ శాఖ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రావణమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది అని చెప్పటానికి సంతోషిస్తున్నాము.

ఇందులో భాగంగా మొదటి రోజు అన్నదానం పాల్వంచ ప్రభుత్వ వైద్యశాల నందు నిర్వహించడం జరిగినది దీనికి ప్రభుత్వ వైద్యశాఖ RMO అధికారులు డాక్టర్ సోమరాజు దొర , సూపర్డెంట్ రాంప్రసాద్ గార్లు ముఖ్యఅతిథిగా అన్నదానాన్ని ప్రారంభించారు.

ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించిన పాల్వంచ అయ్యప్ప సేవా సమితి సభ్యులు జితేందర్,కోటి, రాఘవేందర్రావు, గణపతి, బిక్ష, రాంబాబు పురుషోత్తం, టేకులపల్లి నటరాజ్ , చాపల రవి, వెంకటేశ్వర్లు మచ్చ నాగార్జున తదితరులు కార్యక్రమం దిగ్విజయం కావటానికి కృషి చేసినారు.

అన్నదానం మహాదానం అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప అనే నామంతో అడగంగానే ఇంతటి గొప్ప కార్యక్రమాన్నిగా సహకరించిన దాతలు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

ఇట్లు
అఖిలభారత అయ్యప్ప సేవా సమితి పాల్వంచ శాఖ

error: -