మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
ఈరోజు బెల్లంపల్లి ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ…, ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి,నినాదాలు చేస్తూ ఘనమైన నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ… కమ్యూనిస్టు ఉద్యమాలలో తనదైన పోరాటపటిమ చూపిన సుధాకర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారని తెలిపారు.
తెలంగాణ పోరు 2009 లో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయన మద్దతు పలకడమే కాక పార్టీని సైతం ఒప్పించారని, పార్టీ శ్రేణులు ఉద్యమంలో మమేకమయ్యేలా ప్రోత్సహించారని, ఎస్సీ వర్గీకరణపై పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించి చట్ట సవరణకు డిమాండ్ చేశారని, పలు ఇతర సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచారని, ఆయన మరణం యావత్తు భారతదేశ ప్రజలకు, కమ్యూనిస్టు పార్టీలకు తీరనిలోటని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజశేఖర్, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్











