మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:23 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల: జిల్లాలో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వయోజన విద్య కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య లతో కలిసి మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కొరకు ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, నిరక్షరాస్యతను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, వయోజనులైన ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఉల్లాస్- నవభారత్ సాక్షరత కార్యక్రమం ద్వారా 15 సంవత్సరాలు ఆ పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారికి ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్యతో పాటు కీలక జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత అందించడం జరుగుతుందని తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని మండల స్థాయిలో విజయవంతం చేసే విధంగా మండల విద్యాధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణ, డి.ఆర్.పి.లు జనార్దన్, సుమన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

error: -