మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ…
బెల్లంపల్లి: రాబోయే వినాయక చవితి సందర్భంగా మంగళవారం స్థానిక కాంటా చౌరస్తాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు అందజేసారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ…
పర్యావరణానికి ముప్పు కలిగించకుండా ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన గణపతులను ప్రతిష్టించాలని కోరారు. ప్రకృతికి హాని తలపెట్టే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయబడిన వినాయకులను ప్రతిష్టించడం వలన పర్యావరణానికి హాని తలపెట్టినవారమవుతామని అన్నారు. ప్రజలందరూ కలిసి మెలసి భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ బాపురెడ్డి,దేవాలయ అర్చకులు సతీష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్











