మంచిర్యాల జిల్లా,
తాండూరు,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

తాండూరు: హరిత గణపతుల పంపిణీ అభినందనీయమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1150 మట్టి గణపతులు మొక్కలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ హాజరై మాట్లాడుతూ…,

గత 19 సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులు, హరిత గణపతులు పంపిణీ చేస్తున్న సేవా సంస్థ సభ్యులను అభినందించారు. వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మండల తహసిల్దార్ జ్యోత్స్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎజాజ్దోదీన్, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, సేవా సంస్థ సలహాదారులు శేషగిరి చంద్రశేఖర్, రమేష్, శంకరయ్య, సభ్యులు ప్రవీణ్, విగ్నేష్, శ్రీనివాస్, విజయ్, వాసవి క్లబ్ అధ్యక్షులు మైలారపు మధుసూదన్, కార్యదర్శి మనీ కృష్ణ, కోశాధికారి మహేష్, మాజీ అధ్యక్షులు కాసం భాస్కర్, రేగొండ సంతోష్, బానేష్ తదితరులు పాల్గొన్నారు.

error: -