మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025.
✍️ మనోజ్ కుమార్ పాండే.
గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ళ వద్ద నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కోరారు.
మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన మండపాల ఇంచార్జీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వినాయక చవితి పండుగ నుండి నిమజ్జనం వేడుకలు పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే పోలీసులు దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాస్ రావు, వినాయక మండలి సభ్యులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్











