మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025.
✍️ మనోజ్ కుమార్ పాండే.

గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ళ వద్ద నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కోరారు.

మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన మండపాల ఇంచార్జీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వినాయక చవితి పండుగ నుండి నిమజ్జనం వేడుకలు పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే పోలీసులు దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాస్ రావు, వినాయక మండలి సభ్యులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

error: -