భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్
విద్యార్థుల కోసం ఎక్కడైన, ఎంత దూరమైన కొల్లిఫౌండేషన్ సేవలు
పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయితీ పరిధిలోని కోయగట్టు పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు, స్టేషనరి పంపిణి చేసిన కొల్లి కల్పనా చౌదరి
పాల్వంచ రూరల్ : గిరిజన ప్రాంతాలలోని పేద విద్యార్థులకు విద్యను అందించాలని పాల్వంచ మండలం కోయగట్టు గ్రామంలో ఒక నెల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ప్రారంభించిన ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించడానికి గుర్తించిన 45 మంది నిరుపేద విద్యార్థులకు అండగ మేమున్నామంటు ముందుకు వచ్చారు కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కల్పనా చౌదరి.
కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ సహకారంతో కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయగట్టు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, డ్రాయింగ్ బుక్స్, బ్యాగులు, నోటు పుస్తకాలతో పాటుగా స్టేషనరి ని అందించారు.
ఈ సందర్బంగా కల్పనా చౌదరి మాట్లాడుతూ… కొల్లి ఫౌండేషన్ విద్యాభివృద్ధి పెంచేందుకు ఎల్లపుడు ముందుంటుందన్నారు. చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, చదువుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరని ప్రతి ఒక్కరు విద్యను ప్రోత్సహించాలన్నారు. తల్లి తండ్రుల ఆశలు, ఆశయాలకు తగ్గట్లుగా పిల్లలు చదువుకోవాలని సూచించిన ఆమె పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరితేనే చదువుకు సార్ధకత లభిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో కూడ ప్రభుత్వంతో కలిసి విద్యార్థుల ప్రయోజనం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, భవిష్యత్ లో కోయగట్టు పాఠశాల పక్కా భవన నిర్మాణం కోసం సహాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. Mpps కోయగట్టు ప్రధానోపాద్యయులు N.Biksham గారు మాట్లాడుతు పాఠశాలలో పిల్లల పరిస్థితి గురించి తెలిపిన వెంటనే స్పందించి మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కోయగట్టు గ్రామానికి సరైన రహదారి లేకపోయిన వచ్చి విద్యార్థులకు అండగా నిలిచిన కొల్లి ఫౌండేషన్ ఫౌండర్ కల్పనా చౌదరి, కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ గూడూరు సత్యనారాయణ, కో-ఆర్డినేటర్ రూప్లా నాయక్ లకు విద్యార్థులు, వారి తల్లితండ్రుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు కొల్లి కల్పనా చౌదరి ని శాలువాతో సత్కరించి సన్మానించారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
- బీఆర్ఎస్ లోని బీసీ నేత శీలం సమ్మయ్య గౌడ్ ఆవేదన…
- జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్
- గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు
- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ఒక ప్రకటనను విడుదల చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్
- మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…
