భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
మణుగూరు
✍️దుర్గా ప్రసాద్
పీకే ఓ సి ఔట్ సోర్సింగ్ పనులలో ఏర్పడిన ఖాళీలలో కేవలం భూ నిర్వాసితులను మాత్రమే పెట్టుకోవాలని ఎండి ఎన్.బలరాం ఆదేశాల అమలు చేయాలి
పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
మణుగూరు ఏరియా పీకే ఓ సి ఔట్ సోర్సింగ్ టెండర్ పనులలో ఏర్పడిన ఖాళీలలో కొత్త టెండర్లలో భూ నిర్వాసితులను మాత్రమే పెట్టుకోవాలని ఎండి ఎన్. బలరాం ఆదేశాల అమలు చేయాలని కోరుతూ శనివారం నాడు పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పనులలో అనగా సివిల్ , పర్చేజ్ , సెక్యూరిటీ మరియు ఓబి కాంటాక్ట్ పనులలో ఏర్పడే ఖాళీలలో, నూతన టెండర్లలో కేవలం సింగరేణి భూ నిర్వాసితులను మాత్రమే అవకాశం కల్పించాలని గౌరవ సింగరేణి సిఎండి ఎన్. బలరాం (ఐఆర్ఎస్) ఆదేశాలు టెండర్ షరతులలో కూడా ఈ అంశాన్ని నూతనంగా చేర్చారు.
అయితే పీకే ఓసి లో కొంతమంది కాంట్రాక్టర్లు యాజమాన్యానికి సమాచారం లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా నిర్వాసితులేతరులను మెడికల్ విటిసి చేపిస్తూ గతంలో పని చేశారని మరొకటిని బ్యాక్ డోర్ లో పనిలోకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారనీ ఇప్పటికే కొంతమందిని పనుల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. పర్చేజ్ టెండర్ల లోని ఆయిల్ బ్యారెల్స్ లిఫ్టింగ్, వాషింగ్ ప్లాంట్, మక్ రిమూవల్ , సివిక్, పారిశుద్ధ్యం పనులలో కొత్తవారిని పెట్టారనీ విశ్వసనీయంగా తెలిసిందన్నారు దీనికి సంబంధించి ఏరియా రిప్రజెంటేటివ్ యూనియన్ ఐ ఎన్ టి యు సి నాయకులు కూడా పైసలు పెట్టు పని కొట్టు అని ఆరోపిస్తూ పత్రికలకు ప్రకటనలు కూడా చేశారని దయచేసి ఈ విషయంపై మల్లేపల్లి ఓసీలో భూములు కోల్పోబోతున్న నిర్వాసితులకు, కోల్పోయిన వారికి ప్రభావిత గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
- బీఆర్ఎస్ లోని బీసీ నేత శీలం సమ్మయ్య గౌడ్ ఆవేదన…
- జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్
- గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు
- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ఒక ప్రకటనను విడుదల చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్
- మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…
