భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల 10 వ తేదిన కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి పాల్వంచ పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ సమావేశం రేపు ఆదివారం 31వ తేదిన మధ్యాహ్నం 3 గంటలకు పాల్వంచ భద్రాచలం రోడ్డులోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్భంగా ఈరోజు పాల్వంచలోని కొత్తగూడెం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ బాధ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి నివాసంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులు మాజీ పాల్వంచ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూసల విశ్వనాథం, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ లు మాట్లాడుతూ… కేటీఆర్ గారి కొత్తగూడెం నియోజకవర్గ పర్యటన వచ్చేనెల 10 వ తేదీన ఉంటుందని ఈ పర్యటనలో భాగంగా కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ నాయకులతో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ భాధ్యులు వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన రేపు పాల్వంచ పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొంటారని రేపు జరగబోయే ఈ సమావేశానికి పాల్వంచ పట్టణ, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా అన్నాఈ సమావేశంలో కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, పూసల విశ్వనాథం, కాంపెల్లి కనకేష్ పటేల్, ఎచ్చర్ల రమణమూర్తి నాయుడు, కనకాల బాలకృష్ణ, దాసరి నాగేశ్వరరావు, మడి సరస్వతి, ముగితే గురవయ్య, బట్టు మంజుల, దొడ్డి సురేష్, శీలం సమ్మయ్య గౌడ్, భూక్య చందు నాయక్, కాలేరు సింధు తపస్వి, గుండాల వెంకటనారాయణ, మడి ఈశ్వర్, యన్. వీరభద్రం, ఆర్ వి రమణ, కాలేరు అఖిల్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
- బీఆర్ఎస్ లోని బీసీ నేత శీలం సమ్మయ్య గౌడ్ ఆవేదన…
- జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్
- గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు
- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ఒక ప్రకటనను విడుదల చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్
- మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…
