డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ ) పాల్వంచ నందు హిందీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన రుషి వైదిక విద్యాపీఠం వారు ఆమెకు ఈ అవార్డును అందజేశారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేశ సేవ, సమాజ సేవ, విద్యా సేవ, పరిశోధన, సాహిత్య రంగాలలో అత్యున్నత సేవలు చేసిన వారికి ఈ అవార్డు ప్రదానం చేయబడుతుంది. జాతీయ స్థాయిలో వందకు పైగా అభ్యర్థులు ఈ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపించారు.
రెండు వడపోతల అనంతరం తెలంగాణ రాష్ట్రం నుండి డాక్టర్ టి.అరుణ కుమారి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. హిందీ భాషా అభ్యున్నతి కోసం, హిందీ విద్యార్థుల అభివృద్ధి కోసం మరియు హిందీ సాహిత్య- భాషా రంగాలలో ఆమె నిర్వహిస్తున్న పరిశోధనల కోసం ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమెకు ఒక మెడల్ మరియు ప్రశంసా పత్రం అందజేయబడింది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ గారు ఆమెను మరొకసారి కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థి బృందం తరఫున శాలువతో సన్మానించారు. గతం లో రాష్ట్రస్థాయిలో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న డాక్టర్ టి.అరుణ కుమారి గారికి ఈనాడు జాతీయస్థాయిలో ఇటువంటి అవార్డు లభించడం కళాశాలకు ఎంతో గర్వకారణం అని పలువురు ఆమెను ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు