భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్
జగన్నాథపురం లో కొత్వాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని BRS పార్టీ చేసిన కుట్రలు కుతంత్రాల వలనే బీసీ ల రిజర్వేషన్ తాత్కాలికంగా నిలిపివయబడిందని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ…
బీసీ రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపిందని కానీ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం దానిని పెండింగ్ లో పెట్టడం వలనే స్థానిక సంస్థల ఎన్నికలకు కోర్టు స్టే విధించిందన్నారు. బీసీ ల రిజర్వేషన్ ల కోసం ముఖ్యమంత్రి భగీరథ ప్రయత్నాలు చేశారన్నారు.
కేంద్రం, గవర్నర్, ప్రతిపక్షాలు కలసి రాకున్నా ప్రభుత్వం ఒంటరిగా పోరాడిందన్నారు. ఎవరు ఎన్ని కుటిలయత్నాలు చేసిన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కొత్వాల అన్నారు.
ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఆర్టిఏ మెంబర్ బాదర్ల జోషి,కాంగ్రెస్ నాయకులు చింతా నాగరాజు, వై వెంకటేశ్వర్లు, కొండం పుల్లయ్య, బాదర్ల బాబూజీ, సమ్మెట అప్పారావు, బానోతు బాలాజీ నాయక్, కామాచారి, తవడోజు బ్రహ్మచారి, నునావత్ దేవా తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- Healthy Hair Diet: జుట్టు పెరుగుదలకు మేలైన ఆహారాలు
- Fish Mercury Warning: పాదరసం అధికంగా ఉండే చేపలు తినడంలో జాగ్రత్త అవసరం
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? వాటి అర్థం మరియు ప్రభావం
- తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టోకెన్ ఇచ్చే ప్రదేశాలు
- తిరుమలకు వచ్చే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు… వాటి సమాధానాలు…
- భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు
- నేటి మంచి మాట
- నేటి రాశి ఫలాలు అక్టోబర్ 11, 2025
- నేటి పంచాంగం అక్టోబర్ 11, 2025
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.