భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
10 అక్టోబర్ 2025
✍️దుర్గా ప్రసాద్
నేషనల్ వైరల్ హేపాటైటిస్ కంట్రోల్ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచనల ప్రకారం వైద్య ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే అధికారులు, సిబ్బంది మరియు వర్కర్లందరూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని అదనపు వైద్యాధికారి డాక్టర్ సైదులు అన్నారు.శుక్రవారంనాడు ఏరియా ఆసుపత్రి భద్రాచలంలో హెల్త్ కేర్ వర్కర్లకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టరు. సైదులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బంది తాను చేస్తున్నటు వంటి పనిలో భాగంగా తెలిసో తెలియకనో వృత్తిలో భాగంగా హెపటైటిస్- బి బారిన పడే ఆస్కారం ఉంటుందని అన్నారు. ఆస్పత్రిలో పనిముట్లు, సిరంజిలు, బెడ్లు, ఫ్లోరో, ఇతర కలుషిత వ్యర్ధాలను తాకినప్పుడు ఈ వ్యాధి బారిన పడితే సిరోసిస్ ( కాలేయం పనిచేయక ), కాలేయ క్యాన్సర్ సోకే వీలుందని,అందువల్ల హెల్త్ కేర్ సిబ్బంది అందరూ ముందస్తుగా హెపటైటిస్ బి వాక్సినేషన్ ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రతి ఒక్క సిబ్బంది హెపటైటిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలోని మిగతా అన్ని ఆసుపత్రిలలో పనిచేసే సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ మూడు డోసుల్లో ఉంటుందని, ప్రస్తుతం ఇచ్చే డోసు జీరో డోస్ అని, మిగిలిన రెండు డోసులను కూడా నిర్లక్ష్యం చేయకుండా నిర్దేశించిన సమయానికి ఆనుకూలంగా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం జిల్లా పోగ్రామ్ పర్యవేక్షణ అధికారి డాక్టరు పుల్లారెడ్డి హైపోటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు మరియు సిబ్బందికి ఉన్న అపోహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ రామకృష్ణ,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా