మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:16 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల: ఎగువ ప్రాంతాల నుండి గోదావరి నదిలో నీరు చేరుతున్న దృష్ట్యా నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీర ప్రాంతాన్ని మండల తహసిల్దార్ రఫతుల్లా తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాలలో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్టుల నుండి వరద నీరు గోదావరి నదిలోకి చేరుతుందని, ఈ నేపథ్యంలో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.
ఇందు కొరకు పోలీస్, మున్సిపల్ శాఖల నుండి సిబ్బందిని నియమించి గోదావరి నది తీర ప్రాంతంలో నీటి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను ఆదేశించారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న ఇందిరా మహిళ భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు.
పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు గుత్తేదారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల