భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం
10 అక్టోబర్ 25
✍️దుర్గా ప్రసాద్
మెరుగైన ప్రభుత్వ పాలన జరగాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా సాధ్యమవుతుందని రిటైర్డ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటా దేవదానం అన్నారు.శుక్రవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అత్యధిక గిరిజన జనాభా నివసిస్తున్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అని, ఐటీడీఏ పరిధిలో ఎక్కువ శాతం అమాయకులైన గిరిజనులు వివిధ సంక్షేమ పథకాల కొరకు ఐటీడీఏ ద్వారా లబ్ధి పొందడానికి అర్జీలు పెట్టుకుంటారని కానీ వారికి న్యాయం జరగని పక్షంలో ఆర్టిఐ చట్టం ద్వారా సమాచారం అడగడం వారికి హక్కు ఉందని అందుకు సంబంధిత అధికారులు వారు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో తప్పకుండా అందించి ప్రతి గిరిజనుడికి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.
ఆర్టిఐ చట్టాన్ని1946లో ఐక్యరాజ్య సమితి సమాచారాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిందని, ప్రజాస్వామ్యంలో పారదర్శకత జవాబుదారీతనం పెంపొందించడంలో ఈ చట్టం దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు సక్రమ పద్ధతిలో జరుగుతున్నది లేనిది ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఐటిడిఏ కార్యాలయంలోని అన్ని విభాగాలలో సమాచార హక్కు చట్టం పనితీరు చాలా బాగుందని అన్నారు.ఆర్టిఐ చట్టం ప్రజలను ప్రజాస్వామ్యంలో భాగం చేస్తున్నదని అనేక అనుభవాల తర్వాత 2005లో ఆర్టిఐ చట్టం వచ్చిందని అవినీతిని తగ్గించేందుకు ఉపయోగపడే చట్టమని అన్నారు.
ఈ చట్టం కేవలం సమాచారం తెలుసుకోవడానికే కాక పనులు, రికార్డులు, సంబందిత డాక్యుమెంట్లను తనఖీ చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్న పనులను ప్రజలు పర్యవేక్షించే సాధికారతను కల్పించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి రాంబాబు, ఎస్ ఓ ఉదయభాస్కర్, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డి ఎం జి సి సమ్మయ్య, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఎల్ టి ఆర్ డిటీ నాగేశ్వరరావు, మేనేజర్ ఆదినారాయణ ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? వాటి అర్థం మరియు ప్రభావం
- తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టోకెన్ ఇచ్చే ప్రదేశాలు
- తిరుమలకు వచ్చే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు… వాటి సమాధానాలు…
- భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు
- నేటి మంచి మాట
- నేటి రాశి ఫలాలు అక్టోబర్ 11, 2025
- నేటి పంచాంగం అక్టోబర్ 11, 2025
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.