మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది:9 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: కన్నాల గ్రామపంచాయతీలో కబ్జాకు గురైన ఎర్రకుంట చెరువుకు గండి కొట్టి, చెరువును మాయం చేసి అక్రమ వెంచర్ వేసి ప్లాట్ల విక్రయాల విషయమై రైతు సంఘాల ఐక్య వేదిక, కన్నాల గ్రామస్తులు మంచిర్యాల కలెక్టరేట్ లో ప్రజావాణి లో చేసిన పిర్యాదు మేరకు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో మంగళవారం బెల్లంపల్లి ఎంఆర్ఓ కృష్ణ తో పాటు రెవిన్యూ ఇనస్పెక్టర్,ఇరిగేషన్ డి.ఈ,ఏఈ లు పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ…, సంబంధిత అధికారులు మంగళవారం 4 వ దఫా సర్వే నిర్వహించారని, ఎఫ్టిఎల్, బఫర్ జోన్లు కలిపి 14 ఎకరాల భూమి ఎర్ర కుంట చెరువు విస్తరించి ఉందని, ఎఫ్టీఎల్ జోన్ లో గల రియల్ ఎస్టేట్ వారు హద్దులు పెట్టుకున్న పోల్లను బుధవారం తొలగిస్తామని తెలిపారన్నారు.
అలాగే బుధవారం నుండి పనులు ప్రారంభిస్తామని, ఇసుక బస్తాలతో తాత్కాలిక గండి పూడ్చివేత పనులు జరుగుతాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారని అన్నారు. అక్రమణలను వెంటనే తొలగించాలని తహసీల్దార్ కృష్ణ ఆదేశాలు జారీ చేసినట్టు వారు తెలిపారు. రెండు రోజులలో పూర్తి నివేదిక జిల్లా పాలన అధికారి కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు పంపిస్తామని తెలిపినట్టు అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు టి.మని రామ్ సింగ్, ఎండీ.చాంద్ పాషా, అంబాల మహేందర్, గోగర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్
- శిశు మందిర్ పాఠశాలలో దేశ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…
- బావిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య
- మున్సిపల్ కమిషనర్ స్పందన పట్ల అభినందనలు తెలిపిన కాంట్రాక్టర్ బస్తీ వాసులు
- నేత్రదానం తో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు నింపిన జంగపల్లి రాజారాం
- ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
- గోదావరి నదిలో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…





















