భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ టౌన్లోని దమ్మపేట సెంటర్లో, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ శ్రీ మామిడిశెట్టి నారాయణ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పొనిశెట్టి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
ప్రపంచంలో అగ్రశ్రేణి దేశాలతో సమానంగా దేశ రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దిన ఘనత మోడీ గారిదేనని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలు, అనేక జాతీయ రహదారుల నిర్మాణం, అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయడం, వందలాది సంక్షేమ పథకాలను అమలు చేయడం మోడీ గారి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు.
పాకిస్తాన్ ఉగ్రవాద మూకలను ఎదుర్కొనేందుకు ఆపరేషన్ సిందూర్ పేరుతో శత్రు దేశంలో ఉన్న ఉగ్ర స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిన ఘనతను గుర్తుచేసి, దేశ భద్రత కోసం పనిచేస్తున్న భారత ఆర్మీకి వందనం తెలిపారు.
“సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్” నినాదంతో మోడీ గారు ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలోత్ ప్రశాంత్ నాయక్, మాదారపు లక్ష్మణ్, లింగగిరి వెంకట్రామయ్య, సంతపల్లి గోపాల్, సొంద్ సాహెబ్, రామ్ చరణ్, కిట్టు, రాము, విజయ్, సురేష్, నరేష్, నరేందర్, వెంకటేష్, శ్రీను, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






